విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల 2019 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం శుక్రవారం నిర్వహించారు. జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. సమాజంలో వైద్యులకు, న్యాయవాదులకు ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. రోగికి, వైద్యులకు సంయమనం ఉండాలని చెప్పారు. ఓపికతో రోగుల సమస్యలు వింటే సగం చికిత్స చేసినట్టేనని అన్నారు. కొవిడ్లో 760 మంది వైద్యులు రోగులకు సేవలందించి ప్రాణాలర్పించారని, అటువంటి వైద్యులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించుకోవాలని చెప్పారు. కమర్షియల్గా ఆలోచించే వైద్యులు ఎక్కువగా ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సామాన్యుడికి వైద్యం అందడం గగనంగా మారిందని, ఆరోగ్య వ్యవస్థంతా కార్పొరేట్ రంగంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల నీడపడని ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో పనిచేస్తే వైద్యులు సమాజానికి మంచి సేవ చేసిన వారవుతారన్నారని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే వారికి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ ఐదేళ్లలో ఎంతో కష్టపడి చవిది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండాలంటే పీజీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్కుమార్, కంటి విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ అమ్మన్న పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa