కేంద్ర బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం వినూత్న రీతిలో కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించింది. అదే తరహాలో రాష్ట్ర బడ్జెట్ను ప్రజల్లో చర్చకు పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. అయన మాట్లాడుతూ..... మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై చొరవ తీసుకోవాలి. బడ్జెట్పైన, ప్రభుత్వంపైన ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోండి. అన్న క్యాంటీన్కు వెళ్లి అక్కడ ఉన్నవారితో కలిసి భోజనం చేసి ఫీడ్ బ్యాక్ అడగండి. బడ్జెట్ రూపకల్పనపై ఎంతో కసరత్తు చేశాం.సూపర్-6 హామీల అమలుకు ప్రాధాన్యం ఇచ్చాం. అన్నదాత, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించాం. మే నుంచి వాటిని అమలు చేస్తాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అమలు చేస్తాం. గృహనిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకే అదనంగా నిధులిస్తోంది. ఇకపై బీసీలకూ రూ.50వేలు అదనంగా ఇస్తాం. 2029నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్, పీఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్, గ్యాస్ సరఫరా, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్లో ప్రస్తుతం 161 సేవలు ఇస్తున్నాం. వీటిని త్వరలోనే 500కు పెంచుతాం. దీనిపై ఎమ్మెల్యేలు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. వేసవికాలంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు ఓ యాప్ కూడా తీసుకొస్తున్నాం. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే వారి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికాపత్రం తయారు చేసుకోవాలి. త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa