ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయాలని హేతుబద్ధీకరణ చేయనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 01, 2025, 03:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్ధీకరణ ప్రారంభమైంది. ఏపీ సేవ పోర్టల్‌లో క్లస్టర్ల ఏర్పాటు, సచివాలయ అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ప్రభుత్వం అధికారాలను అప్పగించింది. ప్రతీ క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజన చేసింది. కాగా.. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఆయా జిల్లాలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa