ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ వారికీ ఏ విధంగానూ ఉపకారం చెయ్యకండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:16 AM

గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా బీసీ, ఎస్సీ కాలనీల్లో వాసు, వసంతమ్మలకు ఆయన పెన్షన్లను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీకాలనీలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.అక్కడే ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ప్రసంగించాక సమీపంలోని రామానాయుడుపల్లె వద్ద శనివారం మండల టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘30 ఏళ్ల తర్వాత గంగాధరనెల్లూరులో టీడీపీ జెండా ఎగరేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా. ఈ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చాలి.


తంబళ్లపల్లె, పుంగనూరులో కాస్త గురి తప్పాం.. తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలో కూడా మనమే గెలిచేవాళ్లం. 2014-19 మధ్య అవిశ్రాంతంగా పనిచేసి 13.5 గ్రోత్‌రేట్‌ సాధించాం. అయినా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలకు మంచి చేయకపోవడం వల్ల కాదు.. కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే. మీలో అణువణువూ పసుపు రక్తం తప్ప మరోటి ఉండదు. మీతో నేను మాట్లాడకుంటే నాపై అసంతృప్తి చెందుతారు. అందుకే కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేయించా.


ఇక నుంచి నాకూ,కార్యకర్తలకు మధ్య దూరం ఉండదు. పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలతో సమావేశమవుతా’ అన్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కార్యకర్తలకూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. వన్‌టైమ్‌ ఎంపీ, ఎమ్మెల్యేగా భావించకుండా రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండేలా పనిచేయాలని ఉద్భోదించారు.వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపకారం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు.వారికి ఉపకారం చేయడమంటే పాముకు పాలు పోసినట్లే. అని గుర్తించాల న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa