ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి పాలనలో విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:17 AM

కూటమి సర్కార్‌ తీసుకునే కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగు పడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించిందని, తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిందన్నారు. 1నుంచి 12 తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏటా రూ.,15 వేలు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించనుందని, ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా అందరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రులను మోసం చేసిన వైసీపీ ఇప్పుడు ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa