బొబ్బిలి మండలంలోని కారాడలో వృద్ధురాలు చొక్కాపు గౌరమ్మ మెడలోనుంచి తులంన్నర బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. సీఐ కటకంసతీష్కుమార్ కథనం మేరకు..పొలంలో పనులు ముగించుకుని గౌరమ్మ ఆదివారం మధ్యాహ్నం ఇంటికి నడుచుకొని వస్తోంది. అదే సమయంలో గౌరమ్మను ఎదురుగా వస్తున్న ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఆటో ఎక్కించారు. వెంటనే ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును తెంచుకొని ఆటోలో నుంచి బయటకు నెట్టేశారు. ఏమి జరిగిందో తెలుసుకునేలోగా మెడలోని బంగారు గొలుసు మాయం కావడాన్ని గౌరమ్మ గుర్తించింది. తన భర్త గౌరునాయుడు, కుటుంబ సభ్యులకు చోరీ జరిగినవిషయాన్ని చెప్పడంతో వారు బొబ్బిలి పోలీసులను ఆశ్రయించారు. సీఐ సతీష్కుమార్, ఎస్ఐ ఆర్.రమేష్, ఏఎస్ఐ బీవీ రమణ ఇతర సిబ్బంది హుటా హుటిన ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ సమయంలో ఆటోలో ఓ మహిళతో పాటు ఇద్దరు బాలలు ఉన్నట్లు గౌరమ్మ చెబుతోంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ సతీష్కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa