ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 9న ప్రారంభం కానున్న లక్ష్మినరసింహస్వామి మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 11:58 AM

 చారిత్రాత్మక కోరుకొండ లక్ష్మినరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 9న అంకురార్పణతో ప్రారంభమై 15వ తేదీ చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్నవరం దత్తత దేవాలయంగా ఉండడంతో ఆ దేవస్ధానం కార్యనిర్వహణాధికారి వి.సుబ్బారావు పర్యవేక్షణలో అనువంశక ధర్మకర్త పరాసర రంగరాజ భట్టర్‌ల పర్యవేక్షణలో కల్యాణోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.స్వామి వారి దిగువ ఆల యం,కొండపైన ఆలయాలకు, ఉప ఆలయాలకు,ముఖ ద్వారాలకు మెట్ల మార్గానికి, ఆలయ శిఖరాలకు రంగులు వేస్తున్నారు. అర్చకస్వాములు ఉత్సవ మూర్తులను సిద్దం చేస్తున్నారు. భక్తుల సౌకర్యా ర్థం చలువ పందిళ్లు, టెం ట్లు వేస్తున్నారు. ఉత్సవాలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అం చనా వేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాల్గుణ శుద్ద ఏకాదశి రోజు ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున పెద్ద ఎత్తున భక్తులు దేవుడి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం.ఈ మేరకు కోనే రు వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే షెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నవరం దేవస్థానం సిబ్బంది భక్తులకు స్వామి ప్రసాదంగా లడ్లు తయారుచేస్తున్నారు.ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగు తాయి.సుమారు 16 వరకు హుండీలు ఏర్పా టు చేస్తున్నారు. అంతే కాకుండా మిరియాల వెంట రెడ్డి పంతులు ధర్మసత్రంలో ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఐదు రోజులు పాటు పండితసభలు ఏర్పాటు చేయ నున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa