ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 12:06 PM

రాష్ట్రంలో అప్పుడే ఎండలు పెరిగాయి. మార్చిలోనే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. గత నెల 24న నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలు నమోదైంది. ఈ నెల నుంచే వేసవి ప్రభావం చూపుతూ, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో భానుడు భగ్గుమనే అవకాశం ఉందని హెచ్చరించింది. గత వారం నుంచి రోజురోజుకీ 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఫిబ్రవరి నెలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెలలో సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 27.58 డిగ్రీలు కాగా.. 29.07 డిగ్రీలు (1.49 డిగ్రీలు ఎక్కువ) నమోదైంది. ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గింది. దీంతో భూమిలో, గాలిలో తేమశాతం తగ్గడం దేశంలో వేడి పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa