గార మండలంలోని వత్సవలస రాజమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఏటా మాఘ, ఫల్గుణ మాసంలో జరిగే ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి వివిధ పీఠాల్లో కొలువైన రాజమ్మను దర్శించుకంటారు. శనివారం వత్సవలస చేరుకున్న భక్తులు రాత్రి బస చేసి ఉదయాన్నే దగ్గరలో ఉన్న సముద్రంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం భూలోకమ్మను దర్శించారు. ఎటవంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐలు పైడపునాయుడు, బి.ప్రసాదరావు (మైరెన్), ఎస్ఐ ఆర్.జనార్దనరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa