ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 02:43 PM

గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు అని వైసీపీ  నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అయన మాట్లాడుతూ.... రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి  చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ  సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం` అంటూ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com