ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 11:43 AM

డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఉదయం ఐదవ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa