ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం తగ్గించి.. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా గతంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టి దేశీయంగా తయారీ, ఉపాధి కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తుంటుంది. అయితే దీంట్లో భాగంగానే.. బ్యాటరీ సెల్ తయారీ రంగానికి కూడా ఈ పథకాన్ని కేంద్రం విస్తరించింది. ఇక్కడ మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా రాజేశ్ ఎక్స్పోర్ట్స్ వంటి కంపెనీలు కాంట్రాక్టుల్ని పొందగా.. ఇప్పుడు వీటిపై భారీగా పెనాల్టీ పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ కూడా 2022లోనే ఈ బ్యాటరీ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్కు సంబంధించి బిడ్ గెల్చుకుంది. అయితే ఇక్కడ నిర్ణీత గడువులోగా ఈ కంపెనీ బ్యాటరీ సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేకపోయిందని.. తద్వారా భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక ఈ పెనాల్టీ.. 14.3 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 125 కోట్ల వరకు పడుతుందని తెలుస్తోంది.
రిలయన్స్ న్యూ ఎనర్జీస్ లిమిటెడ్తో పాటు రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కూడా బ్యాటరీ సెల్స్ తయారు చేయాల్సి ఉండగా.. ఇక్కడ కూడా విఫలమైనందున జరిమానా చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ సెల్ ప్లాంట్ల ఏర్పాట్లు కోసం 2022 సంవత్సరంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ, రాజేశ్ ఎక్స్పోర్ట్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ బిడ్స్ గెలుచుకున్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిని తగ్గించుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని బ్యాటరీ సెల్స్ తయారీ కోసం ప్రోత్సహించగా.. ఓలా మినహా ఇవి విఫలమయ్యాయి.
వీటిల్లో భవీశ్ అగర్వాల్కు చెందిన ఓలా సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే పురోగతి సాధించింది. ఓలా యూనిట్ గతేడాది మార్చిలోనే ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించింది. లిథియం అయాన్ సెల్స్ కమర్షియల్ ప్రొడక్షన్ ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మరి రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్, రాజేశ్ ఎక్స్పోర్ట్స్ పెనాల్టీల గురించి అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa