ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రావొద్దని నిర్ణయించిన వైసీపీ అధినేత.. యూటర్న్ తీసుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా వైసీపీ పార్టీ నేతలు గందరగోళం సృష్టించినప్పటికీ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని నిలువరించలేదు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే బాయ్కాట్ చేస్తూ జగన్, ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. జగన్ తీరుపై అధికారపక్షం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష హోదాకు సంబంధించి గత ఏడాది జూన్లో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ సంచలన లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టు ఉన్నారంటూ జగన్ ఆ లేఖలో పేర్కొనడం అప్పట్లో హాట్టాపిక్గా నిలిచింది. ఇప్పుడు తాజాగా జగన్ రాసిన లేఖను స్పీకర్ సభలో ప్రస్తావించారు. అలాగే దీనిపై హైకోర్టును కూడా జగన్ ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే హైకోర్టు స్పీకర్ను ఆదేశించినట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సభలో అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa