ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్ష మందికి పైగా మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 12:30 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైకి మహిళలకు టైలరింగ్‌లో శిక్షణను ఇచ్చి, కుట్టుమిషన్లు అందజేయాలని నిర్ణయించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రకాశం జిల్లా, మార్కాపురంలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్టాళ్లు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa