అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారా.. ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా.. అనేది ప్రజలకు తెలుసునని చెప్పారు. ఢిల్లీ వేదికగా ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇప్పుడు అమలు చేయడం కుదరదని చెప్పారు. జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, ధర్మం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు చేశారు.అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. చంద్రబాబు పాలనను ప్రజలు శభాష్ అంటున్నారన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రైవేట్గా మాట్లాడుతున్న జగన్ వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమి సహాయ సహకారాలతో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిస్థితిని గాడిన పెడుతున్నారని తెలిపారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa