రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పెండింగ్ డైట్ బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.50 కోట్లు విడుదల చేసిందని ఏపీ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డైట్ బకాయిల చెల్లింపుల కోసం నిధులను విడుదల చేసినట్లు బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జరుగుతాయని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa