ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:07 PM

ఏపీలో మద్యం అమ్మకాల పేరిట జరిగిన భారీ కుంభకోణం ముందు ఢిల్లీ స్కామ్‌ చాలా చిన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భూఆక్రమణలు, గంజాయి, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ సరఫరా వంటి హేయమైన నేరాలకు గత ప్రభుత్వంలో పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రూపొందించిన రెండు బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కోరినట్టు చంద్రబాబు తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రజలు పూర్తిగా కూటమి వైపే ఉన్నారని చెప్పారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు 60 నుంచి 67.5 శాతానికి పెరిగింది. సంపదను సృష్టించడం, అభివృద్ధి చేయడం, సంక్షేమం, సాధికారికత అనేవి నిరంతర ప్రక్రియ. సంపద పెంచకపోతే ఎలా పంచగలం? అప్పులతో ఆర్థిక సుస్థిరత సాధించలేం. ఏపీలో నాడు జగన్‌ ప్రభుత్వం, ఢిల్లీలో నిన్నటిదాకా కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీనినుంచి నేతలు గుణపాఠాలు నేర్చుకోవాలి. గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయి.ఎగుమతులు చేసేందుకు అద్భుతమైన పోర్టులు ఉన్నాయి. పరిశ్రమలకు, పెట్టుబడులకు మా రాష్ట్రం స్థావరంగా మారుతోంది. దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటివరకు ఏపీకి వచ్చాయి’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa