ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన బాంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్...

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:15 PM

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ సెమీస్ కు అర్హత సాధించకపోవడంతో ఈ వెటరన్ క్రికెటర్ వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. బుధవారం (మార్చి 5) ఇంస్టాగ్రామ్ ద్వారా తాను వన్డేల నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. గత రెండు వారాలుగా తనకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని ముష్ఫికర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించాడు. మంగళవారం స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించగా ఒక రోజు తర్వాత ఈ బంగ్లా క్రికెటర్ వన్డేల నుంచి తప్పుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో రహీమ్ తన చివరి వన్డే ఆడేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న అతను తన చివరి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ బంగ్లా వెటరన్.. ఇక ముందు టెస్ట్ క్రికెట్ లో మాత్రమే కొనసాగనున్నాడు. బోగ్రాలో జన్మించిన ముష్ఫికర్ 2006లో హరారేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. 19 సంవత్సరాలు తన వన్డే కెరీర్ లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ గా నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa