సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆదోని కేసులో ఎదురుదెబ్బ తగులగా.. మరో రెండు కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. తనపై పెట్టిన కేసులను కొట్టివేయలంటూ పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు (గురువారం) హైకోర్ట్లో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తనపైన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక విశాఖలోని పద్మనాభం పోలీస్ స్టేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సూళ్ళూరు పేట, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్ అమలు కాలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ నివేదించారు. ఈ నాలుగు కేసులకు సంబంధించి పిటిషనర్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సూచించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులకు హైకోర్ట్ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa