విశాఖ గీతం యూనివర్శిటీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. అలాగే ఎంపీ దగ్గుబాటి పురంరేశ్వరి, శ్రీ భరత్ పాల్గొన్నారు. వేదికపై చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర పుస్తకంలో.. చేయాలని లోతుగా అధ్యయనం చేసి అందులో కొన్ని అంశాలను మాత్రమే 340 పేజీల్లో రాసినట్లు తెలిపారు. ఆది నుంచి నేటి వరకు టెక్నాలజీతో సహా అన్ని అంశాలను, ఇందులో క్రోడీకరించానన్నారు. తాను వేదికపై ఎక్కి 30 సంవత్సరాలయిందని.. రాజకీయాల్లో ఉన్నా పుస్తకాలు రాస్తారా అని చాలామందికి అనుమానం ఉంటుందని.. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని అడిగారన్నారు. ఇప్పటికీ నాలుగు పుస్తకాలు రాశానని.. ఇది ఐదో పుస్తకమని.. దీన్ని మాత్రం తాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా 50 ఏళ్లు బ్రతకొచ్చు అంటున్నారని.. చంద్రబాబు 50 సంవత్సరాలు అంటే మీ అబ్బాయి బాధపడతాడేమో అంటూ చలోక్తులు వేశారు దగ్గుబాటి. ‘చాలామంది చంద్రబాబుకు నాకు విభేదాలు అంటారు.. ఒకప్పుడు గతంలో ఉండేవి.. ఇది నిజం. కాలంతో పాటు మనం మారాలి. భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండాలి. నాకు కోరిక లేవు.. కుటుంబం ఆత్మీయులతో సరదాగా ఉండాలి. నేను చాలా సభల్లో పాల్గొన్నా.. 30 ఏళ్లలో వేదిక మీద మాట్లాడుతున్నా.. ఒక మంచి ఉపన్యాసం చేశానని భావిస్తున్నా. చంద్రబాబు చేస్తున్న కృషికి అభినందనలు.. జరిగిపోయిన గతం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa