ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పవన్‌కల్యాణ్‌ను విమర్శించడం విడ్డురం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 10:33 AM

జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదని ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు విశ్వక్సేన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జైల్‌ ఖైదీకి ఎక్కవ రాజకీయ నాయకుడికి తక్కువ అర్హత ఉన్న జగన్‌రెడ్డి నిజాయతీ కలిగిన పవన్‌కల్యాణ్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. క్యారెక్టర్‌ లేని దువ్వాడ శ్రీనివాసరావు పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈ సందర్భంగా ఫిఠాపురంలో జరగనున్న జనసేన పార్తీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ అర్జున్‌ భూపతి, బస్వా గోవిందరెడ్డి, తమ్మినేని శ్రీను, వడ్డాది శ్రీను, బొంతు విజయ్‌కుమార్‌, టి.పైడిరాజు, దాసరి బలరామ్‌, వీరమహిళ స్వన్న పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa