ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత వైసీపీదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 12:32 PM

గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ చార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి, ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు విషయాల గురించి అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. 2022-23,2023-24 సంవత్పరాలకు గానూ వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపిందని చెప్పారు. 2014-19 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలిపారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయన్నారు. జెన్‌కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... విద్యుత్ కొనుగోళ్లకు చెక్ పెడుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ నాయకులు ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa