చైనా, పాకిస్థాన్ దేశాలను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్ర పూరిత సంబంధాన్ని ఇండియా అంగీకరించాలని వివరించారు. అంతేకాకుండా చైనాలో తయారు అవుతున్న అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్ వినియోగిస్తోందని.. వాటితోనే భారత దేశంపై దాడికి యత్నిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తాజాగా జరిగిన ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వర్చువల్ డొమైన్లో చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య బంధం 100 శాతంగా ఉందని వివరించారు. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారు చేసిన అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్ ఉపయోగిస్తుందని వెల్లడించారు. కొన్నిసార్లు వాటితోనే పాక్.. భారత్పై దాడులకు యత్నించిందన్నారు. ఈ రెండు దేశాల నుంచి భారత దేశానికి ముప్పు ఉందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా వేసవి కాలం సమీపిస్తున్నా కొద్ది జమ్ము కశ్మీర్లో చొరబాట్లు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంనిద ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని.. మనమంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉగ్రవాద కట్టడి కోసం భారత చాలా గట్టిగానే చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
భారత దేశాన్ని కాపాడుకునేందుకు చేపడుతున్న చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. 2018 నుంచి ఉగ్రవాద ఘటనల సంఖ్య 83 శాతం తగ్గాయని అన్నారు. కేవలం 45 మంది మాత్మరే ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులు అయ్యాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా సైన్యం చర్యలతో పర్యాటకం రంగం మరింతగా అభివృద్ధి చెందిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa