ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నర్సరీ విద్యార్థిపై రెండో తరగతి బాలుడి ర్యాగింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 07:39 PM

ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని డీపీఎస్ ప్రాంతంలో ఉన్న ఓ బడిలో 8 ఏళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. అయితే ఆరేళ్ల వయసున్న బాలుడు అదే పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. రోజూ వీరిద్దరూ ఒకే బస్సులో వెళ్లి వస్తుంటారు. ఈక్రమంలోనే రెండో తరగతి బాలుడు.. జూనియర్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పడప్పుడూ అతడిని కొడుతూ.. టాయిలెట్లలో బంధించేవాడు. ఇటీవలే ఓరోజు 30 చెంప దెబ్బలు కొట్టి అతడి తీవ్రంగా వేధించాడు. అక్కడితో ఆగకుండా అతడి షూపై ఉమ్మేసి దాన్ని నాకమంటూ గొడవ చేశాడు.


ఇలా రోజూ అతడు ఇబ్బంది పెడుతుండగా.. తీవ్రంగా భయపడిపోయిన బాలుడికి జ్వరం వచ్చింది. అయితే విషయం తెలియని తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 3, 4 ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయింది. అయితే మార్చి 3వ తేదీ రోజు రాత్రి బాలుడు అర్ధరాత్రి నిద్రలో కొట్టొద్దు, వద్దు, వద్దంటూ అరవడం చూసి తల్లిదండ్రులు ఓ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. ఈక్రమంలోనే బాలుడు వైద్యుడికి తన మనసులోని బాధను చెప్పాడు. రెండో తరగతి బాలుడు తనను తీవ్రంగా వేధిస్తున్నాడని వివరించాడు.


దీంతో మార్చి 4వ తేదీ రోజు బాలుడి తల్లిదండ్రులు బడికి వెళ్లి గొడవ చేశారు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఇరుకుంటుంబాలను పిలిచి మాట్లడగా.. తమ కుమారుడికి ఏమీ తెలయదని రెండో తరగతి బాలుడి కుటుంబ సభ్యులు చెప్పారు. అతడిని రోజూ ట్యూషన్, బాక్సింగ్ వంటి తరగతులకు పంపిస్తున్నామని.. ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం రెండో తరగతి విద్యార్థిని బహిష్కరించింది. పోలీసులు కూడా బస్సు డ్రైవర్, పాఠశాల ఉపాధ్యాయులను విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ కూడా పరిశీలిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa