వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, కేవలం సాక్షి పత్రికకు మాత్రమే అయాచిత లబ్ధి చేకూర్చారని శాసనమండలిలో టీడీపీ సభ్యుడు అశోక్ బాబు ఆరోపించారు. సాక్షి పత్రికలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో ప్రత్యేకంగా పోస్టులు సృష్టించి జీతాలు చెల్లించారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణ ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు I&PR ద్వారా మొత్తం 196 కోట్ల రూపాయలు చెల్లించారని ఆయన వెల్లడించారు. అయితే, తమ సమాచారం ప్రకారం సాక్షికి మొత్తం 400 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరిందని అశోక్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఒక వార్తా పత్రికను తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ నిబంధనలు సాక్షి పత్రికకు మాత్రమే వర్తించేలా చేశారని అశోక్ బాబు ఆరోపించారు. దీనివల్ల సాక్షి పత్రికకు ఒక్కసారిగా ఐదు లక్షల కాపీల వరకు సర్క్యులేషన్ పెరిగిందని ఆయన అన్నారు. ఈ జీవో ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఏ డైలీకి ఎక్కువ సబ్ స్క్రిప్షన్లు వెళ్లాయి, ఎందుకు వెళ్లాయి అనే దానిపై ప్రభుత్వం విచారణ చేస్తోందా? అని ఆయన ప్రశ్నించారు.అంతేకాకుండా, సాక్షి పత్రికలో పనిచేసిన అనేక మంది ఉద్యోగులకు గత ప్రభుత్వంలో సలహాదారులుగా లేదా ఇతర హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చి జీతాలు చెల్లించారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ఆయన అడిగారు. ఇన్ని కోట్ల రూపాయలు ఒక పత్రికకు ఇవ్వడంలో అధికారుల పాత్ర ఏమిటి, ఇది ఎలా జరిగిందనే దానిపై కూడా విచారణ జరిపి, వివరాలు సభకు తెలియజేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa