ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఆవిర్భావ సభకు జరుగుతున్న ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 03:08 PM

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో మార్చి 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభ దాదాపు 5గంటలపాటు సాగుతుందన్నారు. మన భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబించేలా కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సభకు పెద్దఎత్తున కా ర్యకర్తలు, అభిమానులు తరలిరానున్నా దృష్ట్యా వారికి ఎలాంటి ఇక్కట్లు ఎదురుకాకుండా జాగ్ర త్తలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా తిరు గు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలగ కుండా ముఖ్యమైన 4 రహదారుల్లో భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారన్నా రు. రైతు, మహిళ ప్రతినిధులు మాట్లాడతార న్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టేబోయే కార్య క్రమాలపై పవన్‌ మాట్లాడతారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa