రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ సీనియారిటీ లిస్టు ఎవరి ప్రమేయం లేకుండా తయారు చేస్తున్నాం అని మంత్రి లోకేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ..... లిస్టు ఫైనలైజ్ అయ్యాక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ చేయబోతున్నాం. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈ చట్టాన్ని తెస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గించి సింగిల్ యాప్ తెస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా అమరావతిలో వరల్డ్ క్లాస్ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. పాఠశాల విద్యలో లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాం. గ్యారంటీడ్ ఫౌండేషన్, లెర్నింగ్, న్యూమరీస్ అమలు చేయబోతున్నాం. పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ లోకి తెస్తున్నాం. ప్రతి క్లాస్ రూమ్ యాక్టివ్ లెర్నింగ్ తేవాలని భావిస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధానం అమలుచేసి, వెనుకబడిన విద్యార్థులకు దానినిబట్టి హోమ్ వర్క్ ఇచ్చేవిధానం తెస్తాం. విద్యార్థుల పనితీరుకు సంబంధించి పూర్తి వివరాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఇస్తున్నాం. జూన్, డిసెంబర్ నెలల్లో ప్రతిఏటా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. విద్యార్థులకు అపార్ ఐడిని కేంద్రం మ్యాండేట్ చేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు ఏం చదివారు, ఇతర వివరాలు అందులో ఉంటాయి. నైతిక విలువలపై ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో పుస్తకాలను తయారు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు బాల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించాం. అందులో ప్రాథమిక విధులు కూడా పొందుపరుస్తాం. పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణకు సైకాలజీ కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. యాక్టివ్ ఏపీ పేరుతో స్కూల్ స్పోర్ట్స్ను ప్రోత్సాహిస్తాం. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ను వంటి వాటిని ప్రోత్సహించి విద్యార్థుల మానసిక వికాసానికి కృషి చేస్తాం అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa