ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు,,,,ఏపీలో కొత్తగా రైల్వే లైన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 06:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గాల పనులు వేగవంతం అయ్యాయి.. శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్‌‌కు సంబంధించి ప్రకాశం జిల్లాలో పనులు జరుగుతున్నాయి. 309 కి.మీ. ఈ మార్గం పనులు పూర్తి చేస్తే హైదరాబాద్‌ను తిరుపతికి కనెక్ట్ చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఈ కొత్త రైలు మార్గం పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పనులకు సంబంధించి కలెక్టర్ ఫోకస్ పెట్టారు.. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమవుతున్నారనే సమాచారంతో నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఆశలు మొదలయ్యాయి.


గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో బొగ్గేరుపై బ్రిడ్జి పనులు చేపట్టగా ఆ పనులు ఆగిపోయాయి. ఈ మేరకు భూసేకరణను ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారం అందేలా చూడాలని స్థానికంగా ఉండే రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉంటుంది.. ఆత్మకూరు డివిజన్‌లోనే 1160 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఈ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ మొత్తం 309 కిలో మీటర్లు కాగా.. మొత్తం 38 స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. ఈ రైలు మార్గం కోసం


ముందు రూ. 2,289 కోట్లు అంచనా వ్యయం కాగా.. ఇప్పటి వరకు రూ. 1500 కోట్లపైనే ఖర్చు చేశారు. పనుల ఆలస్యం కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా రూ.ఐదువేల కోట్లు అంచనా వ్యయం అంటున్నారు. పెరిగిన ధరల్ని బట్టి రూ.7వేల కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు.


వాస్తవానికి ఈ రైలు మార్గం కోసం ఈ 1983లో సర్వే చే యగా.. 2013-14లో రూ. 3 కోట్లు కేటాయించడంతో పనులు జరిగాయి. మధ్యలో బ్రేకులు పడుతూ రాగా.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనులు జరుగుతున్నాయి. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో ట్రాక్ నిర్మాణం, రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే రైల్వే లైన్‌ భూసేకరణకు సంబంధించి 2018 నాటి ధరలు తమకు గిట్టుబాటు కావని స్థానిక రైతులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని.. అక్కడి నుంచి వచ్చే నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. మరి త్వరలోనే ఈ రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.


నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు ప్రకాశం జిల్లాలో ముమ్మరం సాగుతున్నాయి. దర్శి వరకు ట్రయల్ రన్ పూర్తి చేశారు.. రెండు, మూడుసార్లు రైలు కూడా పరుగులు తీసింది.. ఇప్పుడు పొదిలి, కనిగిరివైపు పనులపై ఫోకస్ పెట్టారు.. వీలైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి దర్శి వరకు రైళ్లను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa