భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. చిన్న తనం నుంచే ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకుంటే రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు నెల నెలా పెన్షన్ రూపంలో ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే సంప్రదాయ పొదుపు పథకాల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈక్విటీల్లో హైరిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకునేందుకు చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారు సంప్రదాయ పొదపు పథకాలను ఎంచుకుంటుంటారు. నెల నెలా పెన్షన్ రావాలంటే ఎలాంటి పథకాలు మంచితో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రశ్న: నెలకు కనీసం రూ.12 వేలు ఆదాయం వచ్చేలా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందు కోసం ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి? రాబడితో పాటు జమ చేసిన మొత్తం ఏటా కొంత మేర పెరిగాలంటే ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?
సమాధానం: పైన అడిగిన ప్రశ్నకు ఆర్థిక నిపుణులు పలు సలహాల అందించారు. ఆర్థిక నిపుణుల ప్రకారం సురక్షితమైన పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టి నెల నెలా రూ.12 వేలు రావాలంటే కనీసం 7 శాతం రాబడి హామీ ఉన్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. సుమారు ఒక్కసారే లంప్సమ్ విధానంలో రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే నెల నెలా కొంత రాబడితో పాటు పెట్టిన పెట్టుబడి కాస్త పెరగాలంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
కనీసం 5 సంవత్సరల వ్యవధి ఉన్నప్పుడే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లను ఎంచుకోవాలి. తక్కువ సమయంలో పెద్దగా లాభాలు రావని చెప్పవచ్చు. స్వల్ప కాలంలో నష్ట భయం ఎక్కువగా ఉంటుంది. రూ.18 లక్షలు ఇన్వెస్ట్ చేసి నెలకు రూ.12 వేలు పొందవచ్చు. అయితే పెట్టుబడిపై రాబడి కనీసం 10 శాతం ఉండాలి. ఇందులో నుంచి మీరు 8 శాతం రాబడిని వెనక్కి తీసుకోవచ్చు. మిగితా 2 శాతం పెట్టుబడి వృద్ధికి సహకరిస్తుంది.
![]() |
![]() |