ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని విడిచేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:49 AM

అవినీతి ఆరోపణలు ఉన్న ఎవరిని విడిచేది లేదని అవినీతి సొమ్ము కక్కిస్తాం అని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్‌ స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు వద్దని, ముందు విచారణ చేయించాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అన్నారు. సోమవారం 2025-26 సం వత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంశంపై నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం వాడి-వేడిగా సాగింది. నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, కమిషనర్‌ బాలస్వామి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యంగా డంపింగ్‌యార్డ్‌, కుక్కల ఆపరేషనకు చెందిన అనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ)అంశాలపై టీడీపీ, వైసీపీ వర్గాలు వాగ్వాదాలతో రచ్చ లేపారు. అనుకున్నట్లుగానే బిల్లుల పైనే తీవ్ర స్థా యిలో చర్చ జరిగింది. కార్పొరేటర్లు పలు స్థానిక సమ స్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఒకానొక సందర్భంలో కార్పొరేటర్లు ఇష్టానుసారంగా మాట్లాడటంపై నగర కమి షనర్‌ బాలస్వామి అసహనం వ్యక్తం చేశారు. మొత్తం రూ.135కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa