సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒబెరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను ఆయన కలుస్తారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికార వర్గా లు తెలిపాయి. అంతకుముందు ఉదయం ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయన్ను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమవుతారని.. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం తాలూకు డీపీఆర్ను అందిస్తారని తెలుస్తోం ది. కాగా.. గేట్స్ ఫౌండేషన్తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు.. డిజిటల్ విద్య, జాతీయ విద్య సదస్సు, విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజాసేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పనపైనా ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ రంగాలన్నిటిలో ప్రధానంగా ఏఐను అన్వయించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa