ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మ గ్లౌజ్‌లపై ఎస్ఏఆర్ లెటర్స్,,,భార్య, పిల్లల పేర్లను గ్లౌజ్‌పై వేసుకున్న హిట్ మ్యాన్

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:51 PM

ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ గ్లౌజ్‌పై స్పెషల్ లెటర్స్ కనిపించాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో చెపాక్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. అదే సమయంలో రోహిత్ శర్మ గ్లౌజ్ మీద కొన్ని స్పెషల్ లెటర్స్ కనిపించాయి. దాంతో అసలు ఆ పేరుకు అర్థం ఏంటి అని అందరూ తెగ డీకోడ్ చేయడానికి చూశారు. అయితే మొత్తానికి ఆ లెటర్స్‌ని డీ కోడ్ చేసి వాటి అర్థాలు కూడా వివరించారు.


రోహిత్ శర్మ తన బ్యాటింగ్ గ్లౌజ్‌ల మీద ఇంగ్లిష్ లెటర్స్ ఎస్, ఏ, ఆర్ ఉన్నాయి. అవన్నీ కలిపితే సార్ అని వస్తుంది. కానీ ఒక్కొక్క లెటర్‌ని డీ కోడ్ చేస్తే సమైరా, ఆహాన్, రితిక అని అర్థం వస్తుంది. రోహిత్ శర్మ తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను అలా షార్ట్ కట్‌లో తన గ్లౌజ్ మీద వేసుకున్నాడు. ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చే రోహిత్ ఇలా తన గ్లౌజ్ మీద వాళ్ల పేర్లు కూడా వేసుకోవడం ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.


రోహిత్ శర్మ తన భార్య రితికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ముందుగా ఆడపిల్ల సమైరా జన్మించగా, ఇటీవలే కొడుకు ఆహాన్ పుట్టాడు. రోహిత్ శర్మ-రితిక వివాహం 2015వ సంవత్సరం డిసెంబర్ 13న జరిగింది. 2008 నుంచి వీరు ప్రేమలో ఉండగా పెళ్లి మాత్రం 2015లో చేసుకున్నారు. తమ మొదటి బిడ్డ సమైరాకు 2018 డిసెంబర్ 30న జన్మనిచ్చారు. రెండో బిడ్డ ఆహాన్‌ నవంబర్ 15, 2024న జన్మించాడు.


టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు ప్రతి ఐసీసీ ఈవెంట్‌లోనూ ఫైనల్స్‌కు చేరింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో ఓడిన టీమిండియా వరుసగా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రెండుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన సమయంలో రోహిత్ శర్మ ఈ ఆనందాన్ని తన ఫ్యామిలీతోనే పంచుకున్నాడు.


ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌ను ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఐపీఎల్ 2024కు ముందు తొలగించింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై పలికిన రోహిత్.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com