ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనపై స్పందించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 11:02 AM

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలోని గాంధీ కాలనీలో భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు శనివారం మాట్లాడారు. అంబేడ్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. డీజీపీ స్పందిస్తూ.. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సీఎంకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa