అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మద్యం ధరలను విపరీతంగా పెంచుతూ పోతుండగా.. ఆ ఒక్క రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులు మాత్రం అతి తక్కువ ధరకే.. కాదు కాదు సగం ధరకే మద్యాన్ని అందిస్తున్నారు. అలా అని అది గోవా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎవరూ ఊహించని విధంగా ఉత్తర ప్రదేశ్లో మద్యం ప్రియులు పండుగ చేసుకునే వార్త చెప్పారు అక్కడి లిక్కర్ షాప్ల యజమానులు. ముఖ్యంగా ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ను ఉచితంగా ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలన్నీ.. కొనుగోలు దార్లతో నిండిపోయాయి. అన్ని చోట్ల ధరలు పెంచుతుంటే వీరు మాత్రం "బై వన్ గెట్ వన్" ఆఫర్ ఎందుకు పెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మద్యం దుకాణాలు.. ఒక మద్యం బాటిల్ కొంటే మరో బాటిల్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి బోర్డులు కూడా పెడుతూ మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. ఈ విషయం తెలుకున్న అక్కడి ప్రజలంతా పెద్ద ఎత్తున మద్యం దుకాణాల ఎదుట క్యూలు కడుతున్నారు. అనేక మంది ఇందుకోసం గొడవలు పడుతుండగా.. పోలీసులు వచ్చి వారిని అదుపు చేయాల్సి వస్తోంది. అంతేకాదండోయ్.. అక్కడే బందోబస్తు నిర్వహించాల్సి వస్తోంది. ప్రతీ దుకాణం వద్ద పరిస్థితి ఇలాగే ఉండగా ప్రజలు అంతా షాక్ అవుతున్నారు.
ముఖ్యంగా ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అనేక మంది సెలవులు పెట్టుకుని మరీ.. మద్యం సీసాలు కొనుక్కుంటూ మురిసిపోతున్నారు. వ్యాపారాలు చేసే వారు సైతం ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. వీలైనకాడికి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏడాది వరకు మళ్లీ ఇంత చౌకగా మద్యం దొరకదంటూ.. ఎక్కువ మొత్తంలో కొనుక్కుని దాచుకుంటున్నారు. అయితే లిక్కర్ షాపుల యజమానులు ఈ ఆఫర్ ప్రకటించడానికి ఓ కారణం ఉంది. ముఖ్యంగా యూపీలో ప్రతీ ఏటా లిక్కర్ పాలసీలో భాగంగా లైసెన్సులు జారీ చేస్తారు.
అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా లైసెన్సులు పొందిన వారు మద్యం దుకాణాలు నిర్వహించబోతుండగా.. పాత వాళ్ల వ్దద ఉన్న స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేయాలి. ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వీళ్లు మద్యం అమ్ముకోవడానికి ఎలాంటి అనుమతి లేదు. దీంతో ఏప్రిల్ 1వ తేదీలోగానే స్టాక్ అంతా క్లియర్ చేసుకోవడానికి ఒకటి కొంటే మరోటి ఉచితం అనే ఆఫర్ను ప్రకటించారు. ఇలా సగం ధరకే మద్యం లభిస్తుండడం.. కొత్తగా లైసన్సులు పొందిన వాళ్లు మళ్లీ ధరలు పెంచుతారేమోనన్న భయంతో విపరీతంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ముందుగా ఆ అఫర్లను మార్చి 25వ వరకే పెట్టగా.. ప్రజలు చూపిస్తున్న ఆసక్తితో మార్చి 30వ తేదీ రాత్రి వరకు పొడగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa