తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనానికి ఆధ్యాత్మిక రూపు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. జెఈవో మంగళవారం టిటిడి పరిపాలనా భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పరిపాలనా భవనానికి పెయింటింగ్తోపాటు భక్తులు, సందర్శకుల కోసం ప్రయోగాత్మకంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. కింది అంతస్తులో ఈశాన్యమూలలో ఈ వేదికను ఏర్పాటుచేసి ఉన్నతాధికారులు భక్తుల వద్దకే వచ్చి సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ఉద్యోగులు మరింత సౌకర్యవంతంగా విధులు నిర్వహించేందుకు వీలుగా ఒక నమూనా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, మంచి ఫలితాలు వస్తే పరిపాలనా భవనం మొత్తం ఇదే తరహాలో కార్యాలయాలను ఏర్పాటుచేస్తామని వివరించారు. ఉద్యోగుల్లో మరింత భక్తిభావం పెంచేలా పరిపాలనా భవనంలోని కారిడార్లలో తిరుమల శ్రీవారి ఆలయం, స్థానికాలయాలు, ఇతర ప్రాంతాల్లోగల ఆలయాలు, దేవతామూర్తులకు సంబంధించిన చిత్రపటాలను లైటింగ్తో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa