లోక్సభతో పాటు ఏపి అసెంబ్లీకి కూడా ఎన్నికలు సమీపిస్తున్న కొలది టీడీపీ శ్రేణులలో నూతనోత్సాహం కనిపిస్తోంది. అధికార టీడీపీ . ఇప్పటికే 120 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చే చేయటంతో ఆ పార్టీ నాయకులు తమ్ముళ్లలో జోరు పెంచేలా చర్యలు తీసుకుంటూ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతవారణం సృష్టించేసారు. రాజధాని ప్రాంత నియోజకవర్గం విజయవాడ ఎంపీ, ఉత్తరాం ధ్రకు పట్టుకొమ్మగా ఉన్న శ్రీకాకుళం నియోజకవర్గంపై చంద్రబాబు తనదైన ముద్ర వేశారనే చెప్పాలి. ఇక ఈ సారి ఎన్నికలలో లోక్ సభకు సంబంధించి విజయవాడ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ వ్యాపారవేత్త కేశినేని శ్రీనివాస్ ఉరఫ్ నానికి గడిచిన ఐదేళ్ల కాలంలో ఎంపీగా తన సత్తా చాటారు. విజయవాడలో ప్రజలకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ పై దృష్టిపెట్టిన ఆయన కనకదుర్గ ఆలయం వద్ద ఒక ఫ్లైవోవర్, బెంజిసర్కిల్ వద్ద మరో ఫ్లైవోవర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేశారు. అలాగే గ్రామాలను దత్తత తీసుకోని అభివృద్ధి చేయటంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు లక్ష పైచిలుకు ఓట్లమెజారిటీ ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇక శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్రావు గతంలో లక్షా పదిహేను వేల ఓట్ల భాజీ మెజారిటీతో సాధించగా, ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అబివృద్ధితో పాటు ఏపీ సమస్యలపై కేంద్రం చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆయన పార్లమెంటులో వినిపించిన వాగ్ధాటి ఈ సారి సరికొత్త రికార్డును సృష్టించే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు ఏం జరగనుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa