ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 8 వికెట్ల తేడాతో కేకేఆర్ను ఎంఐ చిత్తు చేసింది. దీంతో ముంబయి ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లోనే 2 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయంగా 27 పరుగులు చేశాడు. తద్వారా సూర్య టీ20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో 8000 పరుగుల ఫీట్ను నమోదు చేశాడు. దీంతో సూర్యకుమార్ 8000 కంటే ఎక్కువ టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ ఫీట్ సాధించిన ఐదవ భారత ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా ఉన్నారు. తన కెరీర్ లో 288వ టీ20 మ్యాచ్ లో ఈ ఘనతను సాధించాడు.
![]() |
![]() |