హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ఈనెల 16న ఉదయం 10గం.26 నిమిషాలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ అధిష్టానం వెల్లడించింది. ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థుల జాబితాను వైసీపీ అధ్యక్షుడు జగన్ విడుదల చేయనున్నారు. 16న ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పార్టీలో కొత్త చేరికలతో ప్రస్తుతం జగన్ బిజీగా ఉన్నారు. పార్టీలో భారీ ఎత్తున చేరికల నేపథ్యంలో అభ్యర్థులపై తుది కసరత్తు చేయాల్సి ఉంది. సీట్ల సర్దుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa