ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సార్ నాక్కొంచెం టైమ్ ఇవ్వండి ప్లీజ్..: ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 10:23 PM

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అందులో సార్ నాక్కొంచెం టైమ్ ఇవ్వండి ప్లీజ్ అంటూ కోరారు. మార్చి 27వ తేదీనే ఈ లేఖను రాసినప్పటికీ.. తాజాగా ఎక్స్ వేదికగా సీఎం ఈ లేఖను పోస్ట్ చేశారు. ముఖ్యంగా జనాాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టవద్దని కోరుతూ.. దక్షిణాది రాష్ట్రాలన్నీ తీర్మానం చేయగా ఆ మెమోను ప్రధాని మోదీకి అందించాలని నిర్మయించుకున్నారు. అయితే ఈ బాధ్యతను ఎంకే స్టాలిన్ తీసుకోగా.. తనకు కాస్త సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన 2026వ సంవత్సరంలో జరగబోతుంది. అయితే జనాభా ప్రాతిపదికనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరుపుతామని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెబుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నేతలు అయితే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కల్గే అన్యాయం గురించి చర్చించేందుకు ఆయా రాష్ట్రాల వివిధ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.


డీలిమిటేషన్ వల్ల సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామంటూ ఆ సమావేశంలో వివరించారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని.. కాకపోతే జనాభా ప్రాతపదికన ఈ ప్రక్రియను కొనసాగించవద్దని అన్నారు. న్యాయ బద్ధంగా, పారదర్శకంగా ఈ పునర్విభజన ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొనగా.. ముఖ్యంగా డీలిమిటేషన్‌పై అనేక తీర్మానాలు చేశారు. ఇందుకు సంబంధించిన మెమోను ప్రధాని మోదీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.


అయితే మార్చి 27వ తేదీనే సీఎం ఎంకే స్టాలిన్.. ఈ మెమోను అందజేసేందుకు కాస్త సమయం ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కానీ ప్రధాని ఇప్పటి వరకు స్పందించ లేదు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ లేఖను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పటికైనా తమ వినతిని వినిపించేందుకు అత్యవసరంగా సమయం ఇవ్వాలని కోరారు. స్పందన కోసం ఎదురు చూస్తానంటూ పేర్కొన్నారు. చూడాలి మరి ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పందించి.. సీఎంకు సమయం ఇస్తారా లేదా అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com