ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారందరికీ నెలకు రూ.5 వేలు.. స్కీమ్ గడువు పొడిగింపు

business |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 11:18 PM

యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని సరైన ఉద్యోగావకాశాలను అందుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అదే ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం. ఈ పథకం రెండో విడత దరఖాస్తులు చేసుకునేందుకు ఉన్న గడువు ఇప్పటికే ముగిసింది. అయితే, మరోసారి అవకాశం కల్పిస్తూ గడువును పొడిగించి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏప్రిల్ 15, 2025 వరకు గడువు ఇచ్చింది. ఆలోపు దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో చేరినట్లయితే నెల నెలా చేతికి రూ.5వేలు అందిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.


2024 వార్షిక బడ్జెట్‌లోనే ఈ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. ఇప్పటికే తొలి విడతలో యువతకు నైపుణ్య శిక్షణ అందించింది. ఇప్పుడు రెండో విడత కింత పైలట్ ఫేజ్ కింద దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గడువు పొడిగించి విద్యార్థులు, యువత దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం ఇచ్చినట్లయింది. అయితే, పలు కంపెనీలకు సంబంధించిన అవకాశాలకు ఎంపిక చేసే ప్రక్రియం ఏప్రిల్ 1, 2025 నుంచే మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ సంబంధించి స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ స్టేటస్ ఏంటి, తర్వాత ఏం చేయాలి అనేది మొబైల్ నంబర్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు పొడిగించినట్లు తెలిపారు.


నెలకు రూ.5 వేల స్టైఫండ్..


పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమం అనేది 12 నెలలు ఉంటుంది. దరఖాస్తు చేసుకుని ఎంపికయిన ప్రతి ఒక్క ట్రైనీకి నెలకు రూ.5 వేల స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ అందించే కంపెనీ తొలుత నెలకు సంబంధించిన స్టైఫండ్‌లో రూ.500 జమ చేస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రూ.4500 జమ చేస్తుంది. అలాగే తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత కేంద్రం ఒకసారి రూ.6 వేలు సైతం ఇస్తుంది.


అర్హతలు ఇవే..


పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి. 21- 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. పూర్తి స్థాయి ఉద్యోగిగా లేదా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్‌లో ఉండకూడదు. అయితే, ఆన్‌లైన్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసే వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే కచ్చితంగా 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మ వంటి డిగ్రీ చేసిన వారు సైతం అర్హులే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com