దేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలను సరిహద్దు భద్రతా బలగాల కళ్లు, చెవులుగా కేంద్రప్రభుత్వం అభివర్ణించింది. దేశ భద్రతను బలోపేతం చేసేందుకు, సరిహద్దు ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని.. ‘‘ఉజ్వల గ్రామాల పథకం’’ రెండో దశకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం శుక్రవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకోబడింది. ఈ పథకంలో భాగంగా.. అతి కీలకమైన సరిహద్దు గ్రామాలలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రూ. 6,839 కోట్ల భారీ ఆర్థిక సాయంతో.. మొత్తం 16 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో 2028-29 నాటికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
ఈ రాష్ట్రాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సామ్, బిహార్, గుజరాత్, జమ్ము-కశ్మీర్, లఢక్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. సరిహద్దు గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి సరఫరా, రవాణా వనరులు మెరుగుపర్చడం.. రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సదుపాయాలు అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోబడతాయి.
ఇక మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రైల్వే మార్గాల విస్తరణకు నాలుగు కొత్త ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. నాలుగు ప్రాజెక్టులలో రెండు ప్రాజెక్టులు ఒడిశాలో ఉన్నాయి. జరపాద (తాల్చేర్-అంగుల్ ప్రాంతం), సంబల్పూర్ మధ్య రూ.3,917 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడవ, నాల్గవ లైన్లు తాల్చేర్ మరియు సంబల్పూర్లలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. 277 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మరిన్ని ప్యాసింజర్ , ఎక్స్ప్రెస్ రైళ్లను నడపడానికి ఒడిశా GDPని పెంచడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో సామర్థ్యం పెంపుదల అవసరమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ ఆధునిక రైల్వే మార్గాల నిర్మాణం వల్ల రవాణా వ్యవస్థ మరింత సత్వరంగా.. సమర్థవంతంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa