2025 IPL లో భాగంగా నిన్న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్vs సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి (31 పరుగులు) మరియు హెన్రిచ్ క్లాసెన్ (27 పరుగులు) ఏకైక యాభై భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రముఖ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీశారు.
153 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ 35 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
![]() |
![]() |