ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నాను కోరిన వైసీపీ అభ్యర్థి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 08:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టీడీపీ-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని వైసీపీ ఆరోపిస్తోంటే, ఏపీపై ముగ్గురు మోదీలు( నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్) దాడి చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. కేసులకు భయపడే జగన్.. బీజేపీకి దాసోహం అయిపోయారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీతో అంటకాగేది మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు పశ్చిన నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయనున్న చంద్రగిరి ఏసురత్నం ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో బుధవారం కన్నావారితోటలోని కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయానికి వెళ్లిన ఏసురత్నం ఆయనతో కరచాలనం చేశారు. ఎన్నికల్లో ఓటేసి తనను గెలిపించాలని కోరుతూ ఆశీస్సులు తీసుకున్నారు. కన్నా చిరునవ్వుతో ఓకే అనడంతో ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. 


 


బీజేపీ-వైసీపీ బంధం గురించి టీడీపీ నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి కన్నా ఇంటికి వెళ్లడం గుంటూరు రాజకీయాల్లో కలకలం రేపింది. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa