ఉత్తరాఖండ్లోని చక్రతాకు చెందిన మహమ్మద్ షబీర్కు ఉత్తర ప్రదేశ్కు చెందిన అమ్మాయితో ఎప్రిల్ 5వ తేదీ శనివారం రోజు ఘనంగా వివాహం జరిగింది. అయితే వివాహం అనంతరం అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ సమయంలోనే వధువు తరఫు బంధువులు అంతా కొత్త పెళ్లి కొడుకు చెప్పులు దాచేశారు. వాటిని తిరిగి ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ మహమ్మద్ షబీర్ మాత్రం కేవలం రూ.5 వేలే ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బులే తీసి వారికి ఇవ్వబోయాడు. దీంతో అమ్మాయి తరఫు వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బిచ్చగాడిలా ఇంత తక్కువగా ఇస్తున్నావేంటంటూ తిట్టి పోశారు.
దీంతో కొత్త పెళ్ల కొడుకు మహమ్మద్ షబీర్ సహా అతడి తరఫు బంధువులు అంతా కోపగించుకున్నారు. ఇంత చిన్నదానికే ఇలా తిట్టడం ఏంటంటూ వారు కూడా తిరిగి దూషించారు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు మీరిచ్చిన బంగారం నాణ్యతతో లేదంటూ చెప్పగా.. గొడవ మరింత ముదిరింది. ఇలా ఇరువైపులా బంధువులు వాదులాడుకుంటుండగా.. పెళ్లి కూతురు తరఫు వాళ్లు కొందరు కొత్త పెళ్లి కొడుకును ఓ గదిలోకి తీసుకెళ్లి బంధించారు. లోపలి నుంచి తాళం వేసి మరీ అతడిపై కర్రలతో దాడికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూనే విపరీతంగా కొట్టారు. విషయం గుర్తించిన వధువు తరఫు వాళ్లు తలుపులు పగులగొట్టి అతడిని బయటకు తీసుకు వచ్చారు.
ఆపై నేరుగా వెళ్లి నజీబాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. అమ్మాయి తరఫు వారిపై ఫిర్యాదు చేశారు. వారు కూడా అక్కడకు వచ్చి అబ్బాయి తరఫు వాళ్లపై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసు అధికారులు ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి.. ఈ చిన్న గొడవ వల్ల పెళ్లి ఆగిపోతుందని చెప్పారు. దాని వల్ల అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ నష్టం జరుగుతుందని వెల్లడించారు. ఇదంతా అర్థం చేసుకున్న ఇరువైపుల వాళ్లు రాజీకి వచ్చి ఆ తర్వాతి కార్యక్రమాలను జరిపించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa