మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రమాద విషయం తెలుసుకొని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి ధైర్యం చెప్పారు. సింగపూర్ లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి నా ధన్యవాదాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి కె.పళనిస్వామి గారు, కేంద్ర మంత్రులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి శ్రీ రఘు రామకృష్ణంరాజు గారు, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేశ్ గారు, శ్రీ కె.ఆచ్చెన్నాయుడు గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారు, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కె.టి.ఆర్. గారు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa