ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది: WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్

international |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 10:33 AM

WHO పాండమిక్ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసానాలను గుర్తుచేశారు. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని వెల్లడించారు.టెడ్రోస్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని ఆయన అన్నారు. అది 20 ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చు అని చెప్పారు. కానీ, కచ్చితంగా వస్తుందని, దానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది సిద్ధాంతపరమైన ప్రమాదం కాదని, ఒక ఎపిడెమియోలాజికల్ ఖచ్చితత్వమని ట్రెడోస్ అన్నారు. కోవిడ్ వల్ల చాలా మంది చనిపోయారని, అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa