తిరుమలలో భక్తుల సాధారణంగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామిని 65,201 మంది దర్శించుకోగా.. 26,243 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93 వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.వసంతోత్సవాల్లో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. చివరిరోజైన ఏప్రిల్ 12వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామితో పాటుగా.. సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు,రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa