ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్ ఇండియా విమానంలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది

national |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 09:34 PM

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.విమానం ల్యాండింగ్ కు కొద్దిసేపటి ముందు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనను ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-2336 విమానం ఢిల్లీ నుంచి బ్యాంకాక్ బయలుదేరింది. విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. విమాన సిబ్బంది వెంటనే స్పందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు.ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకోనున్నారు.ఎయిర్ ఇండియా తన విమానాల్లో మద్యం విధానాన్ని కఠినతరం చేసింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రయాణికుల ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఆదేశించింది.ప్రయాణికులు మద్యం సేవించిన తర్వాత నియంత్రణలో ఉంటేనే సిబ్బంది మరింత మద్యం విక్రయించాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa