ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల మహిళ, హిందూ మతాన్ని స్వీకరించి, 12వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఆలయంలో వివాహం చేసుకుంది. హసన్పూర్ సర్కిల్ అధికారి దీప్ కుమార్ పంత్ తెలిపిన వివరాల ప్రకారం షబ్నమ్ అనే మహిళ హిందూ మతం స్వీకరించి తన పేరు శివాని అని మార్చుకుంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. కొంతకాలంగా శివానికి 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల కుర్రాడితో సంబంధం ఏర్పడింది. గత శుక్రవారం షబ్నమ్ తౌఫీక్ నుంచి విడాకులు పొందింది. ఆ తరువాత ఆమె హిందూ మతాన్ని స్వీకరించి శివానిగా పేరు మార్చుకుంది.పోలీసులు ప్రస్తుతం ఈ వివాహం జరిగిన పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని సమాచారం. శివాని తొలుత మీరట్లో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం, సైదాన్వాలి గ్రామానికి చెందిన తౌఫీక్ను వివాహం చేసుకుంది.ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడి చేయడం నేరం. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa