ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డ్‌తో ఆ పేమెంట్లు చేస్తే... 200 శాతం పెనాల్టీ

business |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 11:00 PM

క్రెడిట్ కార్డులను సరైన విధానంలో వినియోగించుకోగలిగితే ఎంతో ప్రయోజనకరం. లేదంటో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. క్రెడిట్ కార్డు వాడే వారిలో కొంత మంది బెనిఫిట్స్ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. లాజిక్స్ ఉపయోగిస్తూ రివార్డ్ పాయింట్లు పొందుతారు. ఇందులో భాగంగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫేక్ రెంట్ పేమెంట్లు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లు పొందుతుంటారు. అయితే ఇలా ఫేక్ రెంట్ చెల్లింపులు చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టిందని, వారికి ట్యాక్స్ నోటీసులు రావొచ్చంటున్నారు.


క్రెడిట్ కార్డుతో నామినల్ ఫీజుతో అద్దె చెల్లించేందుకు కొన్ని ప్లాట్‌ఫామ్స్ అనుమతిస్తున్నాయి. కొన్ని సంస్థలు రివార్డు పాయింట్లు ఇస్తున్నాయి. చాలా మంది మిలీనియన్స్ ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారట. ఇలాంటి సంఘటనలు పెరుగుతుండడంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచుతున్నాయి. క్రెడిట్ కార్డు పేమెంట్స్ రివార్డ్స్‌ పాయింట్లుతో పాటుగా 45 రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ వస్తుంది. అందుకోసం ఎక్కువ మంది ఫేక్ రెంట్ చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ట్యాక్స్ డిడక్షన్ల కోసం, అధిక రివార్డ్ పాయింట్ల కోసం, క్యాష్‌బ్యాక్, ఎయిర్‌మైల్స్ పొందేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫేక్ పేమెంట్లు చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.


ఫేక్ రెంట్ పేమెంట్లతో ఎదురయ్యే సమస్యలివే


ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం.. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ అద్దె చెల్లిస్తే సెక్షన్ 194-1బీ కింద 10 శాతం టీడీఎస్ కట్టాలి. ఆడిట్ కేసులకు ఏడాది అద్దె రూ.2.4 లక్షలు, నాన్ ఆడిట్ కేసుల్లో నెలకు రూ.50 వేల వరకు మినహాయింపు ఉంటుంది. ఆపైన పేమెంట్లు చేస్తే 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.


స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫేక్ రెంట్ పేమెంట్స్ చేస్తే ఆ నగదును ట్యాక్స్ రిటర్న్స్ ‌లో ఆదాయంగా పేర్కొనాలి. ఏడాదిలో వారు పొందే అద్దె రూ. 1 లక్ష దాటితే ఇంటి యజమాని పాన్ కార్డ్ ఇవ్వాలి. ట్యాక్స్ రిటర్న్స్‌లో వాటి వివరాలు పేర్కొనాలి. లేకపోతే ఐటీ నోటీసులు వస్తాయి.


ఫేక్ రెంట్ రిసిప్ట్‌లు సమర్పించి ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడం నేరం. వాటిని ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. క్లెయిమ్ చేసిన టీడీఎస్‌ల పత్రాలు చూపించాలి. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు పెట్టిడే సెక్షన్ 234ఏ, 234బీ, 234సీ కింద 200 శాతం మేర పెనాల్టీలు పడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa